Motkupalli Narasimhulu: బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అనే ప్రచారం ఉంది

Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం చర్చనీయాశంగా మారింది.

Update: 2021-06-28 10:41 GMT

మోత్కుపల్లి నర్సింహులు(ఫైల్ ఇమేజ్ )

Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం చర్చనీయాశంగా మారింది. అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినప్పటికీ మోత్కుపల్లి హాజరు కావడంతో బీజేపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీజేపీ దళిత వ్యతిరేఖ పార్టీ అనే ప్రచారం ఉందని బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితుల కోసం సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానిస్తే దళిత నాయకుడిగా అఖిపక్షానికి వెళ్లానని వెల్లడించారు. బండి సంజయ్‌తో చర్చించిన తర్వాతే సమావేశానికి వెళ్లానని వెల్లడించారు. నిన్న జరిగిన అఖిలపక్షం హిస్టారికల్‌ అన్నారు మోత్కుపల్లి నర్సింహులు.

Tags:    

Similar News