దత్తాత్రేయను ఘనంగా సన్మానించిన ఆత్మీయులు, అభిమానులు

Update: 2019-09-13 14:16 GMT

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయ తొలిసారిగా హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలో తన ఆత్మీయులను కలుసుకున్నారు. హాత్‌ వే ఆపరేషన్స్‌ హెడ్‌ ప్రవీణ్ కుమార్‌ నివాసానికి వెళ్లిన దత్తన్న.. ప్రవీణ్ తండ్రి సత్యనారాయణ ఆశీస్సులు తీసుకున్నారు. బాధ్యత పదవిని చేపట్టిన ప్రతి సందర్భంలోనూ సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడం దత్తాత్రేయకు చాలా కాలంగా అలవాటు. హిమాచల్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆయన.. అలవాటు ప్రకారం సత్యానారయణ ఆశీస్సులు తీసుకున్నారు. దత్తాత్రేయను కలిసిన వారిలో తెలంగాణ కేబుల్ ఆపరేటర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జితేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, గ్రేటర్‌ అధ్యక్షులు సతీష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌రావు, MSOల అధ్యక్షఉడు ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. వీరంతా దత్తాత్రేయను ఘనంగా సన్మానించారు.

Full View

Tags:    

Similar News