Bandi Sanjay: టైం పాస్ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్ ను మించిన నాయకుడు లేరు

Bandi Sanjay: తెలంగాణకే ఏమీ చేయలేని కేసీఆర్.. ఇక దేశ రాజకీయాల్లోకి వచ్చి చేసేదేమీ లేదు

Update: 2022-06-11 13:00 GMT

Bandi Sanjay: టైం పాస్ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్ ను మించిన నాయకుడు లేరు

Bandi Sanjay: టైంపాస్ పాలిటిక్స్ చేయడంలో సీఎం కేసీఆర్ ను మించినోళ్లు లేరన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ ఆబిడ్స్ లో పొలిటికల్ క్లాక్ టవర్ బుక్ రిలీజ్ చేసిన అనంతరం సీఎంకేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కులమాతాలతో వచ్చిన్నం చేసిన పాలిస్తున్న కేసీఆర్ ఆ నేరం ఇతర పార్టీలపై నెట్టడం సరికాదన్నారు.

రెండుసార్లు అధికారంలోకొచ్చిన తెలంగాణకే ఏమీ చేయలేని కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దేశానికి ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ దేశంలో కుటుంబ పాలన వ్యవస్థ అంతమైపోతుందన్న ఆయన కేసీఆర్ కు కూడా గుణపాఠం తప్పదన్నారు. ఈ 8 ఏళ్ల మోదీ పాలన, కేసీఆర్ పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. 

Tags:    

Similar News