Secunderabad: బోర్డు తిప్పేసిన భవానీ ఎంటర్‌ప్రైజెస్ చిట్ ఫండ్ కంపెనీ

Secunderabad: రూ.30 కోట్లు కట్టించుకున్న శ్రావణ్ కుమార్

Update: 2021-08-31 06:08 GMT

సికింద్రాబాద్ లోని  భవాని చిటీఫండ్ కంపెనీ మోసం (ఫైల్ ఇమేజ్)

Secunderabad: సికింద్రాబాద్‌లో భవానీ ఎంటర్ ప్రైజెస్ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. చిట్టిలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో 30 కోట్ల రూపాయలు కట్టించుకొని బ్లాంక్ చెక్కులు ఇచ్చి తప్పించుకున్నాడని బాధితులు వాపోతున్నారు. వారం రోజులుగా చిట్ ఫండ్ యజమాని శ్రావణ్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మారేడుపల్లి లోని తన నివాసానికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తామంతా మోసపోయామని గ్రహించి మారేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. రేపు సీసీఎస్‌లో కూడా ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్తున్నారు.

Tags:    

Similar News