Bhatti Vikramarka: ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా పాలన చేస్తం

Bhatti Vikramarka: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తాం

Update: 2023-12-10 09:04 GMT

Bhatti Vikramarka: ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా పాలన చేస్తం

Bhatti Vikramarka: రాష్ట్రంలోని వనరులతో సంపదను సృష్టించి.. ప్రజలకు పంచుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇదే తమ ప్రధానమైన ఎజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపద కోసం.. బహుళార్థక సాధక ప్రాజెక్టులు చేపట్టి.. అన్ని రంగాలను ప్రోత్సహిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని భట్టి అన్నారు.

గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంగా దీన్ని హోల్డ్‌లో పెట్టారని.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఇళ్ల స్థలాలు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News