రాష్ట్ర ప్రజలంతా డెంగ్యూ, టైఫాయిడ్తో ఆసుపత్రుల్లో చేరారు- భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రజలంతా డెంగ్యూ, టైఫాయిడ్ తో ఆసుపత్రులలో చేరారని, కానీ సీఎంకు, ఆరోగ్య శాఖా మంత్రికి ఇవి కనిపించడం లేవా అని ప్రశ్నించా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. గులాబీ ఓనర్ షిప్ గొడవలో ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓకే బెడ్పై ఇద్దరు రోగులకు చికిత్స చేస్తున్నారని, అపరిశుభ్ర వాతావరణంలో రోగులకు చికిత్స అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉందని, ఆసుపత్రుల్లో పరికరాలు సరిగా లేవని తెలిపారు భట్టి విక్రమార్క.