Bandi Sanjay: దమ్ముంటే సీఎం కేసీఆర్‌ ఆపాలి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ నుంచి తరిమికొడతాం..

Bandi Sanjay: కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతామని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం యుద్ధాన్ని ప్రారంభించామని అన్నారు బండి సంజయ్.

Update: 2022-08-27 14:02 GMT

Bandi Sanjay: దమ్ముంటే సీఎం కేసీఆర్‌ ఆపాలి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ నుంచి తరిమికొడతాం.. 

Bandi Sanjay: కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతామని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం యుద్ధాన్ని ప్రారంభించామని అన్నారు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్‌ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. అందరం కలిసి కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్ర 4వ విడత డేట్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు సంజయ్. సెప్టెంబర్‌ 12 నుంచి 4వ విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్నామని, దమ్ముంటే సీఎం కేసీఆర్‌ ఆపాలని సవాల్‌ విసిరారు బండి సంజయ్.

Tags:    

Similar News