Bandi Sanjay: కాంగ్రెస్ కు ఓటేస్తే బిఆర్ఎస్ కు వేసినట్లే
Bandi Sanjay: తెలంగాణలో కేసీఆర్ పాలన అంతంచేద్ధాం
Bandi Sanjay: కాంగ్రెస్ కు ఓటేస్తే బిఆర్ఎస్ కు వేసినట్లే
Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందాలతో బరిలో దిగుతున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. మంచిర్యాలలో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావించారు.
తెలంగాణ సాధించుకుంటే బతుకులు బాగుపడుతాయని ప్రజలు భావిస్తే... కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకోసం కేసీఆర్ దొంగ దీక్షచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణకోసం జీవితాలను త్యాగం చేసినవారికి గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందన్నారు.