వేధింపులకు ఏఎస్ఐ బలి

Update: 2019-12-02 05:22 GMT
ఏఎస్‌ఐ నర్సింహులు

హైదరాబాద్‌ బాలాపూర్‌ ఏఎస్‌ఐ నర్సింహులు మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం పీఎస్‌ ముందు నర్సింహులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ నర్సింహులు మృతి చెందాడు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులే కారణమంటూ ఏఎస్‌ఐ నర్సింహులు గతంలో ఆరోపణలు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ను పై అధికారులు బదిలీ వేటు వేశారు.

అయితే అపోలో ఆస్పత్రి వద్ద ఏఎస్‌ఐ నర్సింహులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నర్సింహులు ఆత్మహత్యకు కారణమైన వారిపై మర్డర్‌ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. సీఐ వేధింపులు తాళలేకనే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఎల్బీ నగర్‌ డీసీపీ అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.

Tags:    

Similar News