Hyderabad: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్ రెడ్డి ఘన విజయం.. ఎల్బీనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు
Hyderabad: సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల సంబరాలు
Hyderabad: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్ రెడ్డి ఘన విజయం.. ఎల్బీనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు
Hyderabad: హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపుతో ఎల్బీనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రంగారెడ్డి అర్భన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని బీజేపీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్రెడ్డి, ప్రేమ్ మహేశ్వరరెడ్డి, రంగా నర్సింహ గుప్తా, కొప్పుల నర్సింహారెడ్డి, పవన్, చింతల అరుణ, సురేందర్ యాదవ్తో భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.