హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై రెండు రోజుల క్రితం ఆరోపణలు చేసిన అట్లూరి దంపతులు యూటర్న్ తీసుకున్నారు. మీడియా, సమాజాన్ని క్షమించమని కోరుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. మతిస్థిమితం కోల్పోయి ఆరోపణలు చేశామని చెబుతున్నారు. మీడియా విలువైన సమయాన్ని వృథా చేసినందుకు క్షమించమని కోరుతున్నామన్నారు అట్లూరి సురేష్ దంపతులు. తాము అనాలోచితంగా బంజారాహిల్స్ పోలీసులపై ఆరోపణలు చేశామని తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అంటూ పేర్కోన్నారు. విజయవాడకు చెందిన ఈ జంట ప్రస్తుతం యూసుఫ్గూడలోని చెక్పోస్టులో నివాసముంటున్నారు.
ఇంటి యజమానిని బెదిరించిన కేసులో గతంలోనే వారిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అయితే వీరు హైదరాబాద్లోనే కాకుంగా విజయవాడలో ఉన్నప్పుడు అనేక మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరిద్దరిపై గతంలోనే ఎన్నో చీటింగ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఈ దంపతులు వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసినట్లు హైదరాబాద్లోని వివిధ స్టేషన్లలో వీరిపై చీటింగ్ కేసులున్నాయి.