Hyderabad: జూన్ 22 నుండి ఆషాడ బోనాలు

Hyderabad: జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం

Update: 2023-05-26 08:52 GMT

Hyderabad: జూన్ 22 నుండి ఆషాడ బోనాలు

Hyderabad: హైదరాబాద్‌లో జూన్ 22 నుండి ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనంతో నెలరోజుల పాటు బోనాల జాతర కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం కానుండగా.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆ తెల్లవారు (10వ తేదీన) రంగం ఉంటుంది. ఇక 16 న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News