అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్ను తిరస్కరించాలని అన్నారు. ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదన్న ఆయన రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, లీగల్ హక్కుల కోసం తాము పోరాడతామని అన్నారు.