తెలంగాణాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

Update: 2020-05-22 05:08 GMT

తెలంగాణలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనుంది. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది.

మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2,000లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలన్న ఉద్దేశంతో 20 నెలల క్రితం 9,355 జేపీఎ్‌సల భర్తీ ప్రక్రియ చేపట్టారు. అయితే, కొందరు విధుల్లో చేరకపోవడం, చేరిన కొద్ది రోజులకే రాజీనామా చేయడంతో కొన్ని రోజులకే సుమారు 2,000లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News