మేడిగడ్డకు చేరుకున్న ఏపీ సీఎం జగన్

Update: 2019-06-21 04:40 GMT

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఉదయం 9:45 గంటలకు మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన నేరుగా మేడిగడ్డకు విచ్చేశారు. ఏపీ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడిగడ్డకు చేరుకొని జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News