నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్

Update: 2020-01-10 05:27 GMT

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. జగన్‌ కోర్టుకు హాజరైన నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. కోర్టు మెయిన్ గేట్ వరకే మీడియాకు అనుమతి ఇచ్చారు.

Tags:    

Similar News