వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర విమర్శలు

Somu Veerraju: పరిపాలన అంటే ప్రభుత్వ ఆస్తులు తనకా పెట్టడమా-సోము వీర్రాజు

Update: 2021-06-22 10:31 GMT

సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: పరిపాలన అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడమా అని ఏపీ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. కొత్త అప్పుల కోసం సీఎం జగన్ సొంత ఆస్తులను తాకట్టుపెట్టకుండా.. విశాఖను తాకట్టుపెడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రైతు ప్రయోజనాలకు పాల్పడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదని ప్రశ్నించారు.. దేశంలో ఇటువంటి పరిపాలన ఎక్కడ చూడలేదన్నారు. పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. . విశాఖలో భూ కబ్జాలుపై హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News