దిశ ఉదంతం మరువక ముందే హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి చార్మినార్ వెళ్లేందుకు ఆటో కోసం ఇద్దరు అమ్మాయిులు హష్మబాద్ వద్ద వెయిట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకున్నాడు డ్రైవర్ మహ్మద్ అమీర్. చార్మినార్తో పాటు జహంగీర్పల్లి దర్గాకు తీసుకెళ్లాలని అమ్మాయిలు ఆటో డ్రైవర్కు చెప్పారు. సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం మంచిదికాదని మాయమాటలు చెప్పి ఉదయం తీసుకెళ్తానని నమ్మించాడు. వారిని తన మాటలతో నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్ ఇంట్లో వాళ్లు నిలదీయడంతో అక్కడి నుండి వారిని నాంపల్లికి తీసుకెళ్లాడు.
నాంపల్లిలోని ఓ హోటల్ రూమ్కి తీసుకెళ్లిన మూసా హోటల్లో చెల్లెల్ని చంపుతానని బెదిరించి అక్కపై అత్యాచారం చేశాడు. ఈ నెల 8న అమ్మాయిలు కనిపించడంలేదని పోలీస్స్టేషన్లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఇద్దరు అమ్మాయిలను రైల్వే స్టేషన్లో గుర్తించారు రైల్వే పోలీసులు. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్కు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇద్దరు అమ్మాయిలు నాంపల్లిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అమ్మాయిలను తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆటో డ్రైవర్ మహ్మద్ అమీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.