అమరావతికి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ధర్నా.. మద్దతు ఇవ్వకుంటే సినిమాలు అడ్డుకుంటామని వార్నింగ్ !
ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా ఫిల్మ్ చాంబర్ ఎదుట ఏపీ జేఏసీ, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పలువురు సినీ పరిశ్రమ సభ్యులు హాజరయ్యారు. రాజధానికి మద్దతు ఇవ్వకుంటే ఏపీలో సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్ని పార్టీలూ ఆందోళన చేస్తున్నా సీఎం జగన్ మూర్ఖంగా తరలించాలని చూస్తున్నారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. జగన్ ఇష్టానుసారంగా చేయడానికి కుదరదని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు రామకృష్ణ.