రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర

Revanth Reddy: ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌

Update: 2022-08-19 05:18 GMT

రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర

Revanth Reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలను పదునుపెడుతోంది. మునుగోడు పర్యటనకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. మన మునుగోడు - మన కాంగ్రెస్‌ పోస్టర్‌‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కరోనా నుంచి కోలుకోవడంతో మునుగోడు పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. రేపు రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని... 175 గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించనుంది హస్తం పార్టీ.

Full View


Tags:    

Similar News