మద్యం మత్తులో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మహిళ...

ఈ క్రమంలో ఆమె వారిని బండబూతులు తిడుతూ దాడికి దిగింది. ఓ కానిస్టేబుల్ చేతికి కొరగ్గా, మరో కానిస్టేబుల్ మెడపై గోళ్లతో రక్కేసింది.

Update: 2019-11-17 05:54 GMT
banjarahills

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ పోలీసులకి ముచ్చెమటలు పట్టించింది. లీసా అనే ఓ మహిళ మద్యం సేవించి రోడ్డుపై పడిపోయి ఉండడం గమనించిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో శనివారం రాత్రి జరిగింది. అయితే అక్కడ మద్యం మత్తునుండి తేరుకున్న ఆమె అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

అయితే ఆమెను పట్టుకునేందుకు మహిళా కానిస్టేబుళ్ళు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె వారిపై ఎదురుదాడికి దిగింది. వారిని తిడుతూ ఓ కానిస్టేబుల్ చేతిని కొరికి, మరో కానిస్టేబుల్ మెడపై గోళ్లతో రక్కేసి హంగామా సృష్టించింది. అతి కష్టం మీదా ఆమెను పట్టుకున్న పోలీసులు సేకరించారు. తనది నాగాలాండ్ రాష్ట్రం అనీ, ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉంటున్నాని ఆమె చెప్పుకొచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.

.

Tags:    

Similar News