కామారెడ్డి జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చెరువులో తోసి చంపిన తండ్రి

Update: 2020-03-06 08:42 GMT
కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాజారామ్‌దుబ్బా చెరువులో పడి ముగ్గురు అక్కా చెల్లెళ‌్లు మృతి చెందారు. అయితే ముగ్గురు పిల్లలను కన్నతండ్రి ఫయాజ్‌ చెరువులో తోసేసి హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతులు ఆసియా, మహీన్‌, జియాలుగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News