Mahabubabad: మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పై కేసు నమోదు

Mahabubabad: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ గర్భగుడిలో ఫోటోలు దిగిన సీతారాం నాయక్

Update: 2024-03-31 09:01 GMT

Mahabubabad: మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పై కేసు నమోదు

Mahabubabad: మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో ప్రచురించటం పట్ల ఆగ్రహానికి గురైన రామభక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో ఎలర్ట్ అయిన ఆలయ అధికారులు, భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో BJP ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అనుచర గణం పై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన భద్రాచలం పట్టణ పోలీసులు.

Tags:    

Similar News