తండ్రిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎనిమిదేళ్ల కొడుకు

Update: 2019-10-03 12:17 GMT

తన తండ్రి తనని కొడుతున్నాడని ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వెళ్లి పోలిస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేసాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని ఒడ్డేపల్లిపకి గ్రామానికి చెందినా మహేష్ అనే ఓ ఎనిమిదేళ్ళ బాలుడు తన తండ్రి శివ తనని రోజు కొడుతున్నాడని పోలీసులు ముందు వాపోయాడు. దీనితో ఎస్సై అనిల్‌ రెడ్డి అతని తల్లితండ్రులలకు ఫోన్ చేసి పిలిపించాడు. భార్యభర్తలుగా మీ మధ్య గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ ఇలా పిల్లాడిపై ఆ కోపాన్ని చూపించవద్దని హెచ్చరించాడు. ఇలాంటిది మరోసారి జరిగితే బాగోదని, పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. 

Tags:    

Similar News