Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు, 59 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది.

Update: 2021-05-04 04:15 GMT

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు, 59 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,876 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,476కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1029 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,31,89,817కి చేరింది.



 


Tags:    

Similar News