సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తైంది. పోటీకి మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 45 నామినేషన్లు తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే అంగీకరించారు. అయితే సీపీఎం పార్టీ అభ్యర్థి పారేపల్లి శేఖర్రావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఫారాలు సరిగ్గా నింపకపోవడం వల్లే ఎక్కువ నామినేషన్లు తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.