ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో భారీ లూటీ.. 3 కేజీల బంగారంతో పాటు...

Hyderabad: దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు...

Update: 2021-12-14 05:42 GMT

ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో భారీ లూటీ.. 3 కేజీల బంగారంతో పాటు...

Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో భారీ లూటీ జరిగింది. ఇన్‌కమ్‌టాక్స్ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ అధికారులమంటూ గచ్చిబౌలి నానక్‌రాంగూడాలోని ఆరేంజ్ కౌంటిలోకి ప్రవేశించారు. సి-బ్లాక్‌లో మూడు కేజీల బంగారంతో పాటు పెద్ద ఎత్తున నగదును అపహరించారు. కాగా తాము మోసపోయినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News