హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సనత్నగర్లో ఉంటోన్న పూర్ణిమ 20 రోజుల క్రితం ప్రియుడు కార్తీక్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కార్తీకే పూర్ణిమను హత్య చేసి ఉంటాడంటున్న కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెసరపల్లి గ్రామానికి చెందిన పూర్ణిమ తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. కార్తీక్ గతంలో పూర్ణమ వాళ్లకు చెందిన రబ్బర్ కంపెనీలో పనిచేసేవాడు. పూర్ణమను ప్రేమించి 20 రోజుల క్రితం సింహాచలం దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అనుమానస్పద స్థితిలో పూర్ణిమ చనిపోయింది. కార్తీకే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి ఇంట్లో గోడవ పడినట్లు అనుమానిస్తున్నారు.