ఈఎస్ఐ స్కామ్లో కొనసాగుతున్న అరెస్ట్ల పర్వం
♦ డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీని అరెస్ట్ చేసిన ఏసీబీ ♦ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ ♦ రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు లంచంగా తీసుకున్న లక్ష్మీ ♦ గతంలోనూ ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి రూ.50వేలు లంచం
ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ లంచంగా తీసుకుంది. గతంలోనూ ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి 50వేల రూపాయలను లంచం తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసామని,మరో నలుగురిని అదుపులోకి తీసుకినున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.