భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన న్యూ డెక్రమసీ దళ సభ్యుడు లింగన్న మృతదేహానికి నేడు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం జరిగింది. అనంతరం భారీ బందోబస్తు మధ్య లింగన్న మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో లింగన్న కుమారుడు హరి మాట్లాడుతూ తన తండ్రిది అక్రమ ఎన్కౌంటర్ అని పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని న్యూ డెమోక్రసీ దళ నేత లింగన్న కుమారుడు హరి ఆరోపిస్తున్నాడు. ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని హైకోర్ట్కు వెళ్లామన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు తన తండ్రి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు లింగన్నను పట్టుకునేందుకు అవకాశం ఉండి కూడా కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని పౌరహక్కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయుధాలు కలిగి ఉండటం నేరం అయితే చట్టం ప్రకారం శిక్షించాలని న్యూ డెమెక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.