మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం సూరారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సురారంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడిలో 25 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యాయి. మరో ఎనిమిది మంది వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులను హుటాహుటిన మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోదిస్తున్నారు.