World Test Championship: షెడ్యూల్ ప్రకారమే WTC ఫైనల్ - ఐసీసీ

World Test Championship: జూన్ లో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

Update: 2021-04-20 12:34 GMT
షెడ్యూల్ ప్రకారమే WTC ఫైనల్ (ఫొటో ట్విట్టర్)

World Test Championship: జూన్ లో టీం ఇండియా, న్యూజిలాండ్ టీం ల మధ్య ఇంగ్లాండ్ లో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐసీసీ (International Cricket Council) వెల్లడించింది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి WTC జరగనుంది. ఈ మ్యాచ్ షెడ్యూల్‌ ను ఐసీసీ ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇండియాలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాకపోకలపై ఇంగ్లాండ్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఇండియాను 'రెడ్‌లిస్ట్‌' లో చేర్చింది. అలాగే భారత్‌ నుంచి స్వదేశం తిరిగి వచ్చే ఇంగ్లాండ్ ప్రజలు పది రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.

ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి వెల్లడించింది. 'ఇంగ్లాండ్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ను ఎలా నిర్వహించాలనేదానిపై ఈసీబీ, ఇతర అధికారులు మాకు వివరించారు. దాంతో యథావిధిగా మ్యాచ్‌ను నిర్వహిస్తామనే అనుకుంటున్నాం' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. జూన్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. 'ప్రయాణ ఆంక్షలనేవి కరోనా వ్యాప్తిని బట్టి ఉంటాయి. జూన్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌కు బయలుదేరే నాటికి భారత్‌ 'రెడ్‌లిస్ట్‌'లో ఉండకపోవచ్చు' అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News