Team India: కివీస్ తో గెలిస్తే టీమిండియా సెమీస్ చేరినట్టేనా..!!

* గ్రూప్ 2 లో నమీబియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచే అవకాశాలు ఉండటంతో భారత్ కు కివీస్ తో మ్యాచ్ కీలకంగా మారనుంది.

Update: 2021-10-27 08:17 GMT

Team India: కివీస్ తో గెలిస్తే టీమిండియా సెమీస్ చేరినట్టే..!!

Team India: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా గ్రూప్ 2 లీగ్ మ్యాచ్ లలో టీమిండియా జట్టు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి తరువాత వచ్చే ఆదివారం కివీస్ తో జరగబోయే మ్యాచ్ లో గెలుపు కోసం నెట్స్ లో ప్రాక్టీసుతో భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది. ఇక టీమిండియా జట్టు సెమీఫైనల్ కి చేరాలంటే న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో గెలుపు తప్పనిసరిగా కానుంది. అటు న్యూజిలాండ్ జట్టుకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.

ఇప్పటికే ఇరు జట్లు పాక్ చేతిలో ఓటమిపాలవడంతో జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ అవనుంది. గ్రూప్ 1 లో ఉన్న నమీబియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై భారత్, న్యూజిలాండ్ జట్లు అలవోకగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచిన టీం పాకిస్తాన్ తో పాటు సెమీ ఫైనల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దీంతో ఇరు జట్ల మధ్య పోటాపోటీ తప్పదనే తెలుస్తుంది. మరోపక్క న్యూజిలాండ్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్ కాలిగాయంతో ప్రపంచకప్ నుండి వైదొలగడం కివీస్ జట్టుకు గట్టిదెబ్బ అనే చెప్పాలి. ఏదేమైనా ఆదివారం మ్యాచ్ ఫలితంతో భారత్ - కివీస్ జట్ల టీ20 ప్రపంచకప్ 2021 ప్రయాణం ఎక్కడి వరకు చేరనుందో తెలియనుంది.

టీమిండియా టీ20 ప్రపంచకప్ లో మ్యాచ్ లు

* భారత్ - న్యూజిలాండ్

 అక్టోబర్ 31 ఆదివారం సాయంత్రం 7.30 నిమిషాలు

 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

* భారత్ - ఆఫ్ఘానిస్తాన్

 నవంబర్ 3 బుధవారం సాయంత్రం 7.30 నిమిషాలు

 షేక్ జాయేద్ స్టేడియం అబుదాభి

* భారత్ - స్కాట్లాండ్

 నవంబర్ 5 శుక్రవారం సాయంత్రం 7.30 నిమిషాలు

 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

* భారత్ - నమీబియా

 నవంబర్ 8 సోమవారం సాయంత్రం 7.30 నిమిషాలు

 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం 

Tags:    

Similar News