WTC Final: కొత్త జెర్సీలో టీం ఇండియా ఆటగాళ్లు

WTC Final: టీం ఇండియా, న్యూజిలాండ్ టీంల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2021-05-31 10:33 GMT

కొత్త జెర్సీలతో టీం ఇండియా ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

WTC Final: టీం ఇండియా, న్యూజిలాండ్ టీంల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు జూన్ 2 న టీం ఇండియా ఆటగాళ్లు... ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. ఈమేరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించనున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తయారుచేసిన ఈ కొత్త జెర్సీ ధరించిన పలువురు భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పుజారా, రవీంద్ర జడేజా కొత్త జెర్సీలను ధరించిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ముంబయిలో క్వారంటైన్ లో ఉన్నారు. ఇంగ్లండ్ వెళ్లాక మూడు రోజుల క్వారంటైన్ తరువాత, ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.


Tags:    

Similar News