ధోని పై విమర్శలు : అండగా నిలిచిన లిటిల్ మాస్టర్ ..

Update: 2019-07-03 11:20 GMT

ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ వరల్డ్ కప్ అస్సలు కలిసి రావడం లేదు అనే చెప్పాలి . ధోని పని అయిపోయిందనే కధనాలు కూడా వస్తున్నాయి . సోషల్ మీడియాలో కూడా ధోని పై అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు . ఆఫ్ఘానిస్తాన్ , ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో ధోని అట పై దుమ్మెత్తి పోస్తున్నారు .ధోని స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉండడంతో టీం ఇండియా మాజీ క్రికెటర్లు అతనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు . కానీ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం ధోనికి మాత్రం సప్పోర్ట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఈ మ్యాచ్ లో ధోని 35 పరుగులు చేసాడు . ధోని తన వ్యక్తిగత స్కోర్ కంటే జట్టు స్కోర్ మాత్రమే చూసుకుంటాడని జట్టుకు ఏది కావాలో అదే చేసాడని ధోనికి మద్దతు పలికాడు సచిన్ ... 

Similar News