WPL 2025: చెలరేగిపోయిన ఆలిస్ పెర్రీ, రిచా ఘోష్.. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. దాని ఫస్ట్ మ్యాచ్ నే ఉత్కంఠభరితంగా సాగింది.

Update: 2025-02-15 02:17 GMT

WPL 2025 : చెలరేగిపోయిన ఆలిస్ పెర్రీ, రిచా ఘోష్.. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. దాని ఫస్ట్ మ్యాచ్ నే ఉత్కంఠభరితంగా సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. కానీ ఇందులో బెంగళూరు జట్టు గెలిచింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లోనే మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా సంచలనం సృష్టించింది. 202 పరుగుల చారిత్రాత్మక పరుగుల వేటలో ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, కనికా అహుజా కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ల సాయంతో ఆర్‌సిబి 202 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. గత 2 సీజన్లలో ఇంత పెద్ద స్కోరును ఎప్పుడూ ఛేజ్ చేయలేదని మీకు చెప్తాము.

ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీని తర్వాత, గుజరాత్ జట్టు కెప్టెన్ ఆష్లే గార్డనర్ తుఫాను ఇన్నింగ్స్ సహాయంతో 201 పరుగులు చేసింది. మంధాన నిర్ణయం వారికి భారీగా నష్టం కలిగించబోతోందని ఒక క్షణం అనిపించింది. ఎందుకంటే ఈ భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఆర్‌సిబి కేవలం 14 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయింది. కానీ దీని తర్వాత ఎల్లీస్ పెర్రీ క్రీజులోకి వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు.

రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత జట్టు ఒత్తిడిలో ఉన్నప్పటికీ పెర్రీకి చాకచక్యంగా రాణించారు. ఆమె రాగానే ఎదురు దాడి మొదలుపెట్టింది. తాను, రాఘవి బిష్ట్ కేవలం 54 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, రాఘవి 11వ ఓవర్‌లో 25 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయింది. 13వ ఓవర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న పెర్రీ కూడా పెవిలియన్‌కు బాటపట్టింది. అయితే, తను 34 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్‌తో 57 పరుగులు చేసి తన జట్టు ఆశలను సజీవంగా నిలిపింది. దీని తరువాత రిచా ఘోష్ జట్టును గెలిపించే బాధ్యతలను తీసుకున్నారు.

ఆలిస్ పెర్రీ ఔట్ తర్వాత, RCB మరోసారి కాస్త తడబడినట్లు అనిపించింది. జట్టు విజయానికి కేవలం 46 బంతుల్లో 93 పరుగులు అవసరం. కానీ రిచా ఘోష్ అస్సలు భయపడలేదు. తను పెర్రీ జోరును కొనసాగించి సిక్సర్లు, ఫోర్లు బాదడం ప్రారంభించింది. తను గుజరాత్ జెయింట్స్ బౌలర్లను చిత్తు చేసింది. రిచా కేవలం 27 బంతుల్లో 237 స్ట్రైక్ రేట్‌తో 64 అజేయంగా పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

ఈ పరుగుల వేటలో కనికా అహుజా కూడా రిచాకు చాలా సపోర్టుగా నిలిచింది. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసింది. ఈ విధంగా, RCB తన ముగ్గురు బ్యాట్స్‌మెన్ బలంతో WPL చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. రిచా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

Tags:    

Similar News