రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉమేశ్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. డివిలియర్స్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.