IPL 2020: ఆర్సీబీ వికెట్ కీపర్ గా డివిలియర్స్?

IPL 2020: ఈసారి ఆర్సీబీ జట్టు వికెట్ కీపర్ గా స్టార్ ప్లేయర్ ఎబీ డివిలియర్స్ కొనసాగే అవకసమున్నట్లు తెలుస్తుంది.

Update: 2020-09-01 04:27 GMT

AB de Villiers (File Photo)

IPL 2020: ఈసారి ఆర్సీబీ జట్టు వికెట్ కీపర్ గా స్టార్ ప్లేయర్ ఎబీ డివిలియర్స్ కొనసాగే అవకసమున్నట్లు తెలుస్తుంది. గత రెండు సీజన్ లకు వికెట్ కీపింగ్ చేసిన పార్థివ్ పటేల్ జట్టులో ఉన్నా.. డివిలియర్స్ కు కీపింగ్ బాధ్యతలను అప్పగించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు కోచ్ కటిచ్ సైతం కీపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఇటు సుదీర్ఘ విరామం తర్వాత ఎబీ నెట్స్ లో ప్రాక్టీసు చేసాడు.

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి అన్న విషయం తెలిసినే.. మొత్తం 53 రోజుల పాటు ౬౦ మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.. ఇక ఇప్పటికే అక్కడికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఇతర జట్ల ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు. 


Tags:    

Similar News