ఐపీఎల్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలుపొందింది. దీంతో ఈ లీగ్లో అట్టడుగులో ఉండి మూడో విజయాన్ని దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (37 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించలేకపోయారు. మొయిన్ అలీ (16 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. ధోని (48 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ వృథా అయింది. కాగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుకు పార్థివ్ పటేల్ ఎంపికయ్యాడు.