Ind Vs Eng Test: భారత్ - ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మూడోరోజు వరణుడి ఆట

Update: 2021-08-06 11:00 GMT

నాటింగ్ హోమ్ గ్రౌండ్ (ట్విట్టర్ ఫోటో)

India Vs England Test Match 2021: భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు మ్యాచ్ కి వరణుడు అడ్డంకిగా మారాడు. మూడో రోజు ఆట ప్రారంభమై గ్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కలిసి కేవలం పదకొండు బంతులను ఎదుర్కున్నారు. మ్యాచ్ మొదలు అవగానే రెండు బంతులను పూర్తి చేసిన అండర్సన్ ఆ తరువాత ఓవర్ వేసిన రాబిసన్ ను ఎదుర్కున్న రాహుల్ ఆ ఓవర్ లో ఆచితూచి ఆడటంతో మేడిన్ ఓవర్ గా ముగియడంతో తరువాత పంత్ కి బౌలింగ్ చేయడానికి వచ్చిన అండర్సన్ రెండో బంతికి రెండు పరుగులు చేయడంతో పాటు మూడో బంతిని అద్భుతమైన షాట్ తో ఫోర్ బౌండరీకి తరలించాడు.

ఇక అప్పటికే వర్షం ఎక్కువ అవడంతో మ్యాచ్ నూ అర్ధాంతరంగా ఆపేసి అంపైర్ నిర్ణయంతో ఆటగాళ్ళు పెవిలియన్ కి చేరారు. ప్రస్తుతం వర్షం తగ్గడంతో గ్రౌండ్ ని పరిశీలిస్తున్న అంపైర్ లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

భారత జట్టు బ్యాటింగ్: 132/4 (48.3)

రాహుల్ : 58 (158)

రిషబ్ పంత్ : 13 (12)

ఇంగ్లాండ్ బౌలింగ్ :

ఆండర్సన్ : 14.3 -22-2

ఒల్లీ రాబిన్సన్ : 16-32-1

Tags:    

Similar News