సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా?

Update: 2019-04-18 13:02 GMT

బీసీసీఐ సలహాదారు కమిటీ(సీఏసీ) పదవికి రాజీనామా చేసేందుకు మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం సచిన్‌ టెండూల్కర్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కూడిన సీఏసీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా ఉన్న గంగూలీ.. సీఏసీ పదవిలో ఎలా కొనసాగుతాడంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో గంగూలీ మనస్థాపం చెందారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఎదుట గంగూలీ హాజరై తన వాదనను వినిపించి ఆ తరువాత తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కొంతకాలంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్నాడు గంగూలీ. అయితే.. క్యాబ్‌ చీఫ్‌, ఢిల్లీ సలహాదారు పదవులు 'విరుద్ధ' అంశం కిందకు రావని గంగూలీ అంటున్నాడు. 

Similar News