Ind Vs Eng: భారత్‌-ఇంగ్లండ్ చివరి టెస్టు సమరానికి రంగం సిద్దం

Ind Vs Eng Test Match: వారం క్రితం స్పిన్నర్ల అసాధారణ ఆధిపత్యంతో రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌

Update: 2021-03-04 04:50 GMT

ఇండియా VS ఇంగ్లాండ్ 

Ind Vs Eng Test Match: భారత్‌-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. వారం క్రితం స్పిన్నర్ల అసాధారణ ఆధిపత్యంతో రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిన మొతేరా మైదానంలోనే నాలుగో టెస్టు జరగనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్‌ సొంతమవుతంది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు కూడా అదనంగా దక్కుతుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఒక బెర్తును న్యూజిలాండ్‌ ఇప్పటికే సొంతం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది.
Tags:    

Similar News