ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భాగంగా ప్లేఆఫ్ రేసు నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వైదొలిగింది. ఢిల్లీతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. ఈ సీజన్ లో ఆర్సీబీకిది ఎనిమిదో ఓటమి. ఆడిన 12 మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ ఇంకా రెండు మ్యాచ్ల్లో ఆడాల్సి ఉంది. వీటిల్లో గెలిచినా ఉపయోగం లేదు. కాగా
ఢిల్లీ డేర్డెవిల్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగుకు దిగిన ఢిల్లీ జట్టు 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(52: 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు 171 పరుగులే చేసి ఓటమి పాలైంది. బెంగుళూరు ఆటగాళ్లలోపార్ధివ్ పటేల్(39), కోహ్లి(23), డివిలియర్స్(17), దూబె(24), గుర్కీరత్(27), స్టోయినిస్(32 నాటౌట్)లు మోస్తరుగా రాణించడంతో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో రబడ, మిశ్రాలు చెరో రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, రూథర్ఫర్డ్లు తలో వికెట్ తీసి విజయం కీలక పాత్ర పోషించారు. తాజా మ్యాచ్లో విజయం సాధించడంతో ఢిల్లీ ప్లేఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్టయింది.