ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లతో సూపర్ విక్టరీ అందుకుంది. రాజస్తాన్ గెలుపు అంచుల దాకా వచ్చినా గెలవలేకపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. స్టోక్స్ (26 బంతుల్లో 28; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు.
రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (47 బంతుల్లో 57; 2 ఫోర్లు, 3 సిక్స్లు), చివరి ఓవర్లో హైడ్రామా నెలకొన్నా.. శాంటర్న్ ఆఖరి బంతికి సిక్సర్ తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ధోనీ నిలిచాడు. ధోని (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. స్టోక్స్కు 2 వికెట్లు దక్కాయి.