సొంతగడ్డపై చెన్నై సూపర్కింగ్స్ మరోసారి ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్ మాత్రమే (44 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా హర్భజన్, తాహిర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ చహర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు.