IND vs AUS: మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. భారత్‌పై ఆసీస్‌ విజయం

IND vs AUS: ఉత్కంఠపోరులో ఆసీస్ విజయం

Update: 2023-11-29 01:00 GMT

IND vs AUS: మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ.. భారత్‌పై ఆసీస్‌ విజయం

IND vs AUS: టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్‌ విజయం సాధించింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌ లో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాక్స్‌వెల్ 104 పరుగుల మెరుపు సెంచరీతో చెలరేగాడు. భారత్‌ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మొదటి రెండు బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 4 బంతుల్లో 16గా మారింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ మూడో బంతికి సిక్స్, నాలుగో బంతికి ఫోర్ బాదాడు. ఐదో బంతికి కూడా మ్యాక్సీ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదడంతో ఆసీస్‌ విజయం సాధించింది.

Tags:    

Similar News