Wrestlers Protest: రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద.. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారంటూ టాప్ రెజర్లు ఆవేదన

Wrestlers Protest: పోలీసులు మద్యం తాగివచ్చి తమను దూషించారని కంటతడి పెట్టుకున్న రెజర్లు

Update: 2023-05-04 05:37 GMT

Wrestlers Protest: రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద.. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత.. ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారంటూ టాప్ రెజర్లు ఆవేదన

Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజ్లర్ల శిబిరం వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు మద్యం తాగివచ్చి... తమను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఆందోళన శిబిరం వద్ద నిద్రించేందుకు తాము ఏర్పాట్లు చేసుకుంటుండగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమను కొట్టారని, మహిళా రెజ్లర్లను తిట్టారని చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు రెజ్లర్లకు గాయాలయ్యాయన్నారు.

 ఆసియా, కామన్‍వెల్త్ స్వర్ణ పతకాల విజేత వినేశ్ ఫొగాట్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కంటతడి పెట్టారు. పోలీసులు తమను తీవ్రంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రోజు చూసేందుకా దేశానికి పతకాలు గెలిచిందని భావోద్వేగానికి గురయ్యారు. తమను దూషించారని కంటతడి పెట్టుకున్నారు.

Tags:    

Similar News