తిరుమలేశుని దర్శనానికి‌ సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Update: 2019-10-20 03:46 GMT

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.... ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు..

ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతొంది.

నిన్నటి రోజు శనివారం 93,180 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.37 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 39,421 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.


Tags:    

Similar News