మంత్రి అనీల్ కు రైతుల బాధలు కనిపించడం లేదా : సోమిరెడ్డి

నెల్లూరు ఆనకట్ట కిందికి నీళ్లను ఇవ్వలేకపోతున్నారని చంద్రమోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2020-12-26 10:38 GMT

మంత్రి అనీల్ కు రైతుల బాధలు కనిపించడం లేదా అంటూ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు పెన్నా బ్యారేజీ పనులను ఆయన జిల్లా టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. వరదలు తగ్గి 20 రోజులు కావస్తున్నా.. నెల్లూరు ఆనకట్ట కిందికి నీళ్లను ఇవ్వలేకపోతున్నారని చంద్రమోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు డబల్‌ ‌డిగ్రీ సాధించడం కాదు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు ముందుండి నిలబడాలని సూచించారు. మొన్న వచ్చిన వరద కారణంగా 7వందల కోట్ల నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు.

Full View


Tags:    

Similar News