కేబినెట్ విస్తరణ జాప్యంపై ప్రతిపక్షనేత సిద్దరామయ్య తీవ్రంగా మండిపడిన కొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు కర్ణాటక సీఎం యడియూరప్ప. అన్ని అడ్డుకులు తొలగిపోవడంతో మంగళవారం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 11 నుంచి 13 మందితో తొలి విడత విస్తరణ జరిపేలా తీర్మానించినట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం పేర్లు ప్రకటించనున్నడంతో మంత్రివర్గ విస్తరణకు అన్నీ అడ్డంకులు తొలగిపోయినట్టు అయిందన్నారు.